నిజాంసాగర్, బతుకమ్మ :
పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మసీదులో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ విందును కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా ఏర్పాటు చేయగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, సోదరభావం, ఐక్యతను ప్రతిబింబించేలా విందు నిర్వహించారు. మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పవిత్ర కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు.
