బతుకమ్మ : నాగిరెడ్డిపేట : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం సోదరులకు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మిలటరీ సైనికుడు గంపల వెంకయ్య ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సోదరభావంతో మెలగాలన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం సోదరులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వంతుగా ము స్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.