నేరం చేస్తే జైలు జీవితం అనుభవించాల్సిందే

ఎస్పీ  యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :నేరం చేస్తే జైలు జీవితం అనుభవించాల్సిందేనని, హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  2022 మే 10న ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పసిముద్దీన్ అలియాస్ టిల్లు అనే వ్యక్తి వసీమా బేగం తలపై ఇనుపరాడ్‌తో  బలంగా పలు మార్లు కొట్టి  హత్య చేశాడని ఆమె భర్త షేక్ కలీముల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషనులో కేసు నమోదు...