Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 1:34 pm Posted by : ramakrishna

వైద్యులు పెద్దస్పత్రికి రిఫర్ చేస్తే .. అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు

గాంధారి, బతుకమ్మ:  ప్రసవం కోసం మహిళ కామారెడ్డి జిల్లా ఆస్ప త్రికి  వెళ్తే.. వైద్యులు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. మార్గ మాధ్యలో గర్బిణికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు. వివరాల్లోకి వెళ్తో.. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం మాదవపల్లి గ్రామానికి చెందిన చింతల అఖిల (25) కు పురిటి నొప్పులు అధికo రావడం తో  కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి వైద్యులు డెలివరీ చేయక 108 అంబులెన్స్ లో నిజామాబాద్ ఆసుపత్రి కి రాత్రి వేళ రిఫర్ చేసి పంపించారు. మార్గ మధ్యలో గర్బిణికి పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్ సిబ్బంది చాక చక్యంతో డెలివరీ చేశారు. తల్లి –  బిడ్డ క్షేమంగా ఉన్నారని నిజామాబాద్ ఆసుపత్రి లో వారిని చేర్పించారు.108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి – ప్రభాకర్, పైలెట్ – భిక్షపతి లను కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.