Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 2:19 pm Posted by : ramakrishna

సాగునీరిస్తారా..? సచ్చిపోవాల్నా..?

. పంట ఎండుతోందని ఓ రైతు ఆవేదన

బోధన్, బతుకమ్మ: కళ్ల ముందే పంట ఎండిపోతోందని.. సాగునీరిస్తారా? సచ్చిపోవాల్నా? అంటూ ఓ రైతు చేతిలో పరుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. జాడి గ్రామానికి చెందిన మాధవరావు అనే రైతు పొలానికి వెళ్లి ఎండుతున్న పంటను చూసి ఆవేదనకు లోనయ్యాడు. పురుగుల మందు డబ్బా తీసుకుని సాగునీరందిస్తారా..? సచ్చి పోవల్నా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  నిజాంసాగర్ డి28 కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని సాలూర మండలం జాడి, బోధన్ మండలం రాంపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బోధన్ నియోజకవర్గంలో పలువురు రైతులు సాగునీటి కోసం అధికారులను నిర్బంధించిన ఘటనను మరువకముందే మరో రైతు ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది. సాగునీరందింది పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.