- అధ్యక్షులు మధు కృష్ణ
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం వద్ద చేనేత సంఘ అధ్యక్షులు సన్నపుల మధు కృష్ణ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం సభ్యులు, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీలకంటి సంతోష్ మాట్లాడుతు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో పెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ, చేనేత పరిశ్రమ అనేక ఆటు పోటులను ఎదుర్కొంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం సభ్యులు లోక మనోహర్, మరగల వెంకటరమణ, చుక్కల తీర్థం శ్రీనివాస్, శంకర్ గుర్రపు నారాయణ, గోపాల్, హనుమన్లు, బాలకృష్ణ,కృష్ణ,గణేష్ గూడ నరసింహులు, వెంకటేష్, రోహన్, శ్రీకాంత్, సత్యనారాయణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.