తెలంగాణ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా
. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై మోడీ ట్వీట్ నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ప్రజలతో మమేకమైన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయవంపై మోడీ అభినందనలు తెలిపారు.