ఆర్మూర్, బతుకమ్మ:
అనుమానంతో బార్యను భర్త గోంతు కోసి హత్య చేసాడు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్మూర్ పట్టణంలోని పెద్ధబజార్ కు చెందిన ముద్ధంగుల అంజలి, గంగాధర్ లు ధంపతులు. ఇరువురు మద్య ఇటివల కాలంలో అనుమానాలతో గోడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం భార్య అంజలిని భర్త గంగాధర్ గోంతుకోసి హత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ పరిశీలించి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. భార్య అంజలిని భర్త గంగాధర్ కత్తితో కోసి హత్య చేశాడని స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటన స్థలంను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పరిశీలించారు.
