నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ అర్ముడ్ రిజర్వు పోలీస్ విభాగం లో పనిచేస్తున్న ఇన్స్ పెక్టర్ సతీష్ గన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఉంటున్న ఇన్స్ పెక్టర్ సతీష్ (40) తన సర్వీస్ రివాల్వర్ తో క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి మృతి చెందినట్లు తెలిసింది.గన్ కాల్పులు శబ్దం తో అక్కడ కి చేరుకున్న ఇతర సిబ్బంది సతీష్ రక్తపు మడుగులో ఉండి చనిపోయినట్టు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.ఘటన స్థలాన్ని అధికారులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సతీష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి అని సమాచారం.
