ఖమ్మం , బతుకమ్మ:
ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం ఏసీబీ పంజా విసిరింది. తన వద్ద పనిచేసే ఉద్యోగి వద్ద లంచం తీసుకుంటూ హాస్టల్ వార్డెన్ ను అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ (బాయ్స్ హాస్టల్ (ఐటీ డి ఏ )) హాస్టల్ లో వర్కర్( కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఏసీబీ ఫిర్యాదులు అందుతున్నాయి.