Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:09 pm Posted by : ramakrishna

వేతన బకాయిలు చెల్లించాలని ఆస్పత్రి కార్మికుల ఆందోళన

బాన్సువాడ, బతుకమ్మ : పెండింగ్​లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో కార్మికులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆస్పత్రిలోని సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా వేతనాలు బకాయి చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా, దీపావళి పండగల వేళ కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని, అప్పులు చేసి రోజువారీ ఖర్చులు వెళ్లదీసుకుంటున్నామని వారు తెలిపారు. మాకు వేతనాలు ఇవ్వకపోతే విధులు ఎలా నిర్వహించగలమని కార్మికులు ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఏజెన్సీ తక్షణమే బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.