Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 8:23 pm Posted by : ramakrishna

రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం బాధ్యులకు సన్మానం

 

హైదరాబాద్, బతుకమ్మ:

ఇటివల ఏఐసీసీ నియమించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఎంపీ మల్లు రవి, సభ్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన జీవి రామకృష్ణ తో పాటు మిగతా మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ను జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎడ్ల నాగరాజు, రాంభూపాల్, హరిబాబు, బాబి ,50 డివిజన్ ఇంచార్జ్ ధర్మారం ఆవీన్, 9 డివిజన్ ఇంచార్జ్ పత్తి శోభన్ కుమార్, 51 డివిజన్ అధ్యక్షులు సర్దార్ గబ్బర్ సింగ్, సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు