బదిలీపై వెళ్లిన కానిస్టేబుళ్ళకు సన్మానం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల  పోలీస్ స్టేషన్ పరిధిలో  విధులు నిర్వహించి, సాధారణ బదిలీ పై వెళ్లిన కానిస్టేబుల్ లు ప్రదీప్, గణపతి, రేఖ పటేల్ లను మంగళవారం రుద్రూర్ ఎస్సై పి.సాయన్న, పోలీసు బృందం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.  ఈ సన్మాన కార్యక్రమంలో ఏఎస్ఐ రాజు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.