Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 8:37 pm Posted by : ramakrishna

టెన్త్ క్లాస్ విద్యార్థులకు సన్మానం

డిచ్పల్లి, బతుకమ్మ : ఘన్పూర్ లోని జడ్పీహెచ్ఎష్ హైస్కూల్లో టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ  మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్మాస్టర్ ఆనంద్ మాట్లాడారు. ఘన్ పూర్ హై స్కూల్ విద్యార్థులు ఏ.స్వాతి 493 మార్కులు, సుప్రియ 492 మార్కులు సాధించారని తెలిపారు.  స్కూల్ లో 96.7శాతం ఉత్తీర్ణత సాధించారని  తెలిపారు. రాబోవు రోజుల్లో మండల్ ఫస్ట్ వచ్చేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతామని  అన్నారు. అంతే కాకుండా ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు ఫై చదువుల కొరకు మా వంతు సహకారం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పేద వర్గానికి చెందిన వారు వారికీ ఎన్ని ఇబ్బందులైన కష్ట పడి చదివి మా పాఠశాలకు మంచి పేరు తెచ్చారు అన్నారు. ఈ రిజల్ట్ కు పాఠశాల  పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు. గ్రామ పెద్దలు, యువకుల సహకారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నారాయణ,సంతోష్, ధనలక్ష్మి, మానవతా సదన్ రమేష్, పాఠశాల చైర్మన్ గంగామణి, పాఠశాల శ్రేయోభిలాషి సాయినాథ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.