రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయురాలకు, గ్రామ సెక్రెటరీగా విధులు నిర్వహించి బదిలీలపై వెళ్తున్న సెక్రెటరీకి సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగామణి వరప్రసాద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు నస్రిన్, రఫత్ బేగం ,శారద, గ్రామ సెక్రటరీ గంగారాం లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.