బదిలీపై వెళ్తున్న ఉద్యోగికి సన్మానం
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఎన్నికల సెక్షన్ లో గత 5 సంవత్సరాలుగా ఉత్తమ ఉద్యోగిగా సేవలు అందించి శుక్రవారం బదిలీపై వెళ్తున్న కంప్యూటర్ ఆపరేటర్ షేక్ ముస్తఫా ను తహసీల్దార్ ఎం డి ముజీబ్, నాయబ్ తహసిల్దార్ శివ రామకృష్ణ, గిర్దవార్ ఎం శంకర్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యాలయంలో రెండు ఎన్నికలు నిర్వహించిన దాంట్లో కీలకంగా పనిచేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.