కేశ్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి మండలంలోని కేశ్ పల్లి గ్రామానికి చెందిన సర్వ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు మున్నూరు ప్రణయ్, సర్వ సమాజ్ సంఘం అధ్యక్షులు యాటకర్ల దేవేశ్, గ్రామ యూత్ అధ్యక్షులు రాజ శేఖర్, ప్రవీణ్, బాజాగౌడ్, నర్సాగౌడ్, లింబద్రి,చిన్నాగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.