Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 4:30 pm Posted by : ramakrishna

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ సిబ్బంది

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని ట్రాఫిక్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు.  ఖలీల్ వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది   కానిస్టేబుల్ చిన్నోళ్ల ఉదయ్,  గోపాల్ లకు ఎవరో పోగొట్టుకున్న పర్సు దొరికింది. దీంతో వారు వివరాలు తెలుసుకొని మాక్లూర్ మండలం జ్యోతినగర్ గ్రామానికి సుజాత పర్సుగా గుర్తించారు. బాధితురాలికి రూ. 2వేల విలువ గల పర్సను ట్రాఫిక్ సిబ్బంది అందజేశారు.  దీంతో కానిస్టేబుల్ ఉదయ్, గోపాలులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు.