టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, బతుకమ్మ : స్కూల్​కు ఫోన్​ తీసుకొచ్చాడనే  కారణంగా విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని  బంజార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బంజారా సేవా సంఘం నాయకులు గురువారం తెలిపిన వివరాలు..  ధర్పల్లి మండలంలోని దుబ్బాక  జిల్లా పరిషత్​ పాఠశాలలో గతనెల 20 తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు రామ్ వత్ చరణ్ అనే విద్యార్థి స్కూల్​కు ఫోన్​ తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన హెచ్​ఎం సదరు విద్యార్థిని కొట్టి.. దూషించిందని  సంఘం నాయకులు ఆరోపించారు. ...