ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
రుద్రూర్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రుద్రూర్ ప్రఖండ ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్) గ్రామంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. సామ్రాజ్య స్థాపనకు శివాజీ పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న కుట్రలను, గుర్తు చేసుకున్నారు. శివాజీ నిర్మించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.