డిల్లీ, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం ప్రారంభమైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈభేటీకి హాజరయ్యారు. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, సరిహద్దుల్లో పరిస్థితిపై కూడా చర్చించనున్నారు.