హైదరాబాద్, బతుకమ్మ : గ్రూప్- 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ప్రకటించిన ఫలితాలను రద్దు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, వాటి ఆధారంగానే ఫలితాలను వెల్లడించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ అది సాధ్యంకాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. మూల్యాంకనంలో అక్రమాలు జరగిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు మంగళవారం కీలక తీర్పు వెలువరించారు.