Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 3:02 pm Posted by : ramakrishna

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో..

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావులపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, ఈకేసులో రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని పీపీ వాదనలు వినిపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో చక్రధర్ గౌడ్ పై రాధాకిషన్ రావు అక్రమ కేసులు బనాయించారని పీపీ కోర్టుకు తెలిపారు.