ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి దరించాలి
బతుకమ్మ, పిట్లం: పిట్లం మండలం పోతిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం పిట్లం ఎస్సై రాజు ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ద్విచక్ర వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని,తప్పకుండా హెల్మెట్ ధరించాలని,ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సరైన ద్రుపత్రాలు లేని వారికి జరిమానలు విధించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవిచంద్ర గౌడ్,నాగరాజు పాల్గొన్నారు.