జక్రాన్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాంచందర్ శనివారం గుండెపోటులో మృతి చెందారు. రాంచందర్ గత నాలుగు రోజుల క్రిత బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం కార్డయాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తోటి ఉద్యోగులు నివాళులు అర్పించారు.