సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా

నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గాంధీ గంజ్ లో గల కూరగాయల మార్కెట్ ను  నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి గురువారం పరిశీలించారు. కూరగాయల వ్యాపారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డ్రెయినేజీ మరమ్మతుల పనులను పరిశీలించారు.