Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 8:21 pm Posted by : ramakrishna

మొన్న మాట ఇచ్చాడు.. నేడు నెరవేర్చాడు

  • అభిమాని ఇంటికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :తన అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే గా గెలువాలని వేములవాడ పట్టణం నాంపల్లి కి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో తను నిత్యం అమ్మే కూరగాయల బండిని తన ప్రచార సాధనంగా చేసుకొని మైక్ లో జననేత ఆది శీనన్నను గెలిపించండి అంటూ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ప్రజా ఆశీర్వాదంతో ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్ గా నియామకం కబడి నిత్యం ప్రజల మధ్య ఉంటున్న విషయం తెలిసిందే.నాంపల్లి సాలరామన్న పల్లిలోని కదురు బాలయ్య ఇంటికి వెళ్లి వారి దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి తేనేటి విందులో పాల్గొన్నారు.తన గెలుపులో భాగస్వామ్యం కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

He gave his word yesterday.. and fulfilled it today