Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 6:04 pm Posted by : ramakrishna

హరిత సేన పోస్టర్ ఆవిష్కరణ

భీమ్ గల్, బతుకమ్మ :  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 మాజీ సీ. ఎం కేసీఆర్ జన్మదిన సందర్బంగా నిర్వహించే వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా ముద్రింన వాల్ పోస్టర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా రూపకర్త, మాజీ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు పిలుపు మేరకు జిల్లా ఇంచార్జ్ భోజ నారాయణ ఆదేశానుసారం బాల్కొండ కానిస్టేన్సీ ఇంచార్జ్ గడలా ప్రసాద్ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమం లో వేల్పూర్ మండల బీయర్ఎస్ ప్రెసిడెంట్ నగదర్ రెడ్డి, మాజీ ఎంపిటేసీ రాజు, డోళ్ళ రాజేశ్వర్, శ్రీనివాస్, రమేష్, సొసైటీ చైర్మన్ లింబారెడ్డి, మాజీ సర్పంచ్ లు రమేష్, గంగారెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.