- కేసు నమోదు చేసిన పోలీసులు
బతుకమ్మ, నందిపెట్ : నందిపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఓ యువతిపై ఐదుగురు యువకులు వేధించి, దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నందిపేట ఎస్ఐ చిరంజీవి స్పందించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వన్నెల్( కె), సిద్ధాపూర్ గ్రామాలకు చెందిన దాసరి సాయిరాం, బుర్ర విజ్ఞేష్, కరడి సృజన, సలిగంటి సాయికుమార్, కొండూరు రాహుల్ లు కలిసి ఈ నెల 15న రాత్రి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.