ఘనంగా ఇంజినీర్స్ డే
పాలిటెక్నిక్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు, గౌరవ అతిథిగా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి హాజరై విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ బి నరేశ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పి. బాలనరసింహులు, ప్రధాన కార్యదర్శి...