మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : జిల్లా ప్రజలందరికి మాజీ మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన దీపావళి పండగ విశిష్టతను వివరిస్తూ మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకందరికి అందిస్తుందని అన్నారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా వేముల ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.