నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని బర్కత్ పుర పాఠశాల లో రాజ్యాంగ దినోత్సవాన్ని పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సర్దార్ క్రిపాల్ సింగ్, సోడి కనకపురం రవీందర్, రాష్ట్ర జిల్లా బాధ్యులు రమేశ్, సందీప్, జ్యోత్స్న, సుచిత్ర, సావిత్రి, వింధ్య తదితరులు పాల్గొన్నారు.