గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్ లోని  గౌలిగూడ రామ్ మందిర్ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చూస్తున్నారు.  450 సీసీ కెమెరాలు, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటల వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది.