Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 8:51 pm Posted by : ramakrishna

హన్మంత్ రెడ్డి లిఫ్ట్ సత్వరమే ప్రారంభించాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : శ్రీరాం సాగర్ లో విరివిగా నీరు ఉన్నందున చౌట్ పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ను సత్వరమే ప్రారంభింపజేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారిని ఆదేశించారు.శనివారం కానిస్టేన్సీలో పలు శుభ కార్యాలకు హాజరైన ఆయనను కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు సంబంధిత అధికారితో ఫోన్ లో మాట్లాడారు.ఎస్సారెస్పి లో నీళ్లు ఉన్నప్పుడే హన్మంత్ రెడ్డి లిఫ్ట్ స్టార్ట్ చేసి తద్వారా శేట్ పల్లి పంప్ హౌస్ ను ప్రారంభించి మోర్తాడ్ ముసలమ్మా చెరువును నింపాలని సూచించారు. ముసలమ్మా చెరువు నింపుతూనే సమాంతరంగా బషీరాబాద్ కాడి చెరువును నింపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.