Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:11 pm Posted by : ramakrishna

మున్సిపాలిటీ బిల్డింగును స్కూలుకు అప్పగించండి

 

. . . ఆర్డీఓకు వినతి పత్రం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని గణేష్ మందిర్ స్కూల్ భవనం నూతన మున్సిపాలిటీ భవనంగా మారడం వలన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నందు వలన మున్సిపాలిటీ బిల్డింగును పాఠశాలకు అప్పగించవలసిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఈశ్వర్ జాదవ్ ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు. పాఠశాల బిల్డింగ్ మున్సిపాలిటీకి కేటాయించడం వలన 150 మంది విద్యార్థులు 5 మంది టీచర్లు గదుల కొరత వలన ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఆ భవనం పాఠశాలకు అప్పగించాలని ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.