Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 7:11 pm Posted by : ramakrishna

గుమ్మిర్యాల రైతు రాజారెడ్డి కి రైతు రత్న పురస్కారం

 

. . . వ్యవసాయ మంత్రి తుమ్మల చేతుల మీదుగా స్వీకారం

ఏర్గట్ల , బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కు చెందిన రైతుకు రైతు రత్న పురస్కారం లభించింది. హైదరాబాద్ లోని కాన్హ శాంతి వనం లో జరుగుతున్న మహా కిసాన్ మేళాలో  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతు రత్న, పురస్కారాన్ని గుమ్మిర్యాల రైతు సోమ రాజా రెడ్డి స్వీకరించారు. రాజా రెడ్డి నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయం చేయడంతో ఈ పురస్కారం అందజేయడం జరిగిందని ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు.