బతుకమ్మ, నిజామాబాద్
బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ గాంధీ చూపిన బాటలో బిసి లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుకు పోరాటం చేస్తామని, వెంటనే బిసి కుల గణన సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసిటియు జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు కొట్టూరు రమేష్, ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, బాబు, గౌరవ సలహాదారులు రమణ స్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
