పిట్లం బతుకమ్మ : పిట్లం మండల కేంద్రంలోని లోక సంతోష్ స్వామి నివాసంలో పూజారి గంగాధర్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా శివ పడిపూజ నిర్వహించడం జరిగింది.కన్నె సాములు,గురు స్వాములు కలిసి మహా పడిపూజను చేశారు. 41 రోజు కఠోర దీక్షను పొంది పడిపూజ చేయాలని ప్రతి ఒక్క స్వామి దీక్షతో నియమ నిబంధనలతో పూజకు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి గురు స్వామి,బొంతపల్లి కృష్ణమూర్తి స్వామి, మహిపాల్ రెడ్డి స్వామి, కిషన్ గౌడ్ స్వామి మరియు శివ స్వాములు అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.