ఏనుగుదాడిలో నానమ్మ, మనుమరాలు  మృతి

బతుకమ్మ, వెబ్ డెస్క్ : ఏనుగుదాడిలో నానమ్మ, మనుమరాలు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పరై సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓతోటలో నివాసం ఉంటున్న మహిళపై, ఆమె మనువరాలిపై ఏనుగుదాడి చేసింది. ఏనుగు ఒక్కసారిగా దూసుకొచ్చి వారిని తొక్కడంతో వారు ఘటన స్థలంలో మృతి చెందారు. ఈదాడిలో మృతి చెందిన వారిని 55 ఏళ్ల అస్లా, ఆమె మూడేళ్ల మనువరాలు హేమశ్రీ గా గుర్తించారు.