కేటీఆర్ కు ఘన స్వాగతం
మెండోరా, బతుకమ్మ : హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరికీ బాల్కొండ నియోజకవర్గం పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.