ఘనంగా రథసప్తమి వేడుకలు

హైదరాబాద్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి పురస్కరించుకొని పలు వాహనాలపై తిరుమల శ్రీవారిని ఊరేగించారు.