Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 5:00 pm Posted by : ramakrishna

యువజన నాయకుడు కృష్ణ పాటిల్ ( కిట్టు)ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని గాజులపేటలో యువజన నాయకుడు కృష్ణ పాటిల్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి తెచ్చి పెట్టారని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని ప్రతి పౌరులు దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని డివిజన్ పరిధిలో ఉన్న పేద ప్రజలకుఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.