రుద్రూర్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలో చేనేత సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. సుమారు 60 ఏళ్ల క్రితం చేనేత సహకార సంఘం ఏర్పాటు కాగా పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. 298 ఓటర్లు రుద్రూర్, బోధన్, రెంజెల్, కోటగిరి, వర్ని, మోస్రా మండలాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.