ఎల్లారెడ్డి రామాలయంలో ఘనంగా రథోత్సవం

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి పట్టణంలోని సిద్దుల వారి రామాలయం లో ఈ రోజు ఉదయం 4 గంటలకు రథోత్సవం నిర్వహించారు.రామాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు రథం లాగారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ, ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు, భారీగా భక్త జనం పాల్గొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తూ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.