ధాన్యం లారీ బోల్తా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బైపాస్ రోడ్, కలెక్టరేట్ సమీపంలో రిలయన్స్ చౌరస్తా  నుండి కలూర్ వైపు వెళ్తున్న TS16UB 4434 వడ్ల ధాన్యం లారీ శనివారం సాయంత్రం  కలెక్టర్  కార్యాలయం సమీపం లో   బొల్తా పడింది. ముందుగా వున్న బైక్ కు ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో లారీ బోల్తా పడింది అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.