కలెక్టర్ ను కలిసిన గవర్నమెంట్ ప్లీడర్ కె.శ్యామ్ గోపాల్ రావు

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గవర్నమెంట్ ప్లీడరు గా ఎన్నికైన సందర్భంగా అడ్వకేట్ కె.శ్యామ్ గోపాల్ రావు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు కలిశారు. తెలంగాణ ఏర్పాటు అయినా తరువాత మొదటిగా గవర్నమెంట్ ప్లీడర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.శ్యామ్ గోపాల్ రావుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. కేసులు విషయంలో సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తామని కోర్టు వ్యవహారాలు చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.