హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి మొత్తం రూ. 150 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. జీపీల ఖాతాల్లో ఈనిధులు జమకానున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో మల్లీపర్పస్ వర్కర్లకు ఈజీతాలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జీపీల్లోని 53 వేల మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వ నిర్ణయంతో ఊరట కలగనుంది.