- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం తరపున తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని పులాంగ్ రోడ్ లో కురుమ సంఘ కమ్యూనిటీ హాల్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి కృషి చేసిన సభ్యులందరినీ అభినందిస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హంధాన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవ వేణు, కాంగ్రెస్ సీనియర్ నరాల రత్నాకర్ పాల్గొన్నారు.
