- అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న తెలంగాణ పోలీసులు
- ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
- హైకోర్టును ఆశ్రయించి దీక్షకు అనుమతి కోరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని, ప్రభుత్వం అడ్డుకున్నా.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీక్షపై ప్రకటన చేసిన రోజే సెంట్రల్ జోన్ పోలీసులు అనుమతి కోరుతూ తెలంగాణ జాగృతి నాయకులు దరఖాస్తు అందజేశారు. అనుమతిపై నిర్ణయం ప్రకటిస్తామని శుక్రవారం సాయంత్రం వరకు సాగదీశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించి దీక్షకు అనుమతి కోరుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.