Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 1:14 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం  చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

 

 బిక్కనూర్, బతుకమ్మ:

భిక్కనూరు మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల తో కలిసి  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గృహప్రవేశం చేశారు. శనివారం జరిగిన నూతన గృహప్రవేశం లో లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ . ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,గ్రామ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు రాజబాబు గౌడ్, విజయ్ గౌడ్, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Government advisors Shabbir Ali who entered the house along with Indiramma beneficiaries